ఇది అరుదైన గులాబీ రంగు వజ్రం. 170 క్యారెట్ల ఈ పింక్ డైమండ్.. ప్రపంచవ్యాప్తంగా 300 సంవత్సరాలలో వెలికి తీసిన అతిపెద్ద వజ్రం. అంగోలాలోని లూలో గనిలో జరిపిన తవ్వకాలలో దొరికిన ఈ డైమండ్ను ‘లూలోరోజ్’గా పిలుస్తున్నారు. సహజంగా దొరికే గులాబీరంగు వజ్రాలకు డిమాండ్ ఎక్కువ. 2017లో జరిగిన హాంకాంగ్ వేలంలో 59.6 క్యారెట్ల ఓ పింక్ డైమండ్.. రూ.596 కోట్ల ధర పలికింది.