వాషింగ్టన్: మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు అమెరికాలో వేగంగా జరుగుతున్నాయి. అవయవ కొరతను అధిగమించేందుకు అక్కడి శాస్త్రవేత్తలు గత కొన్నేండ్లుగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి కాలేయంలో ఉండే లక్షణాలను పంది కాలేయంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గానూ పంది కాలేయంలోని కణాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఆ తర్వాత మనుషులకు ఉపయోగపడని దానం చేసిన కాలేయం నుంచి కణాలను పంది కాలేయంలోకి చేరుస్తారు. తర్వాత మనిషి శరీరం బయటే కృత్రిమంగా ఈ కాలేయం రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తుందో పరీక్షించనున్నారు.