మనీలా: పిలిప్పీన్స్ దేశాధ్యక్ష పదవి కోసం మేటి బాక్సన్ మన్నీ పాక్వియావో పోటీపడనున్నారు. ఆదివారం ఆయన ఈ ప్రకటన చేశారు. 2022లో జరిగే దేశాధ్యక్ష పోటీల్లో బరిలోకి దిగనున్నట్లు సూపర్స్టార్ బాక్సర్ తెలిపారు. అయితే చాన్నాళ్ల నుంచి ఉన్న ఊహాగానాలకు ఆయన బ్రేక్ వేశారు. సమయం ఆసన్నమైందని, నాయకత్వాన్ని స్వీకరించేందుకు రెడీగా ఉన్నట్లు పాక్వియావో తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి పార్టీలో రెబల్గా ఉన్న ఆయన దేశాధ్యక్ష పదవికి నామినేషన్ను స్వీకరించారు.
బాక్సర్ పాక్వియావో మాజీ వరల్డ్ చాంపియన్. పిలిప్పీన్స్లో ఆయనో హీరో. కొన్ని వారాల క్రితం లాస్ వెగాస్లో జరిగిన ఫైట్లో ఆయన యోర్డెనిస్ ఉగాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2010లో పాక్వియావో రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సేనేట్కు ఎన్నికయ్యారు. ప్రపంచంలో సంపన్న బాక్సర్గా మారిన 42 ఏళ్ల పాక్వియావో తన దాతృత్వ లక్షణంతో గొప్ప పేరును సంపాదించారు. తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కొన్న పాక్వియావో .. ఆ తర్వాత తన బాక్సింగ్ ఆటతో ఎనలేని కీర్తిని ఆర్జించారు. స్టార్ బాక్సర్గా ఎదిగిన ఆయనకు సెలబ్రిటీ స్టాటస్ వచ్చింది. డ్రగ్ గ్యాంగ్లపై డుటెర్టి కొనసాగిస్తున్న అణిచివేతకు బాక్సర్ పాక్వియావో మద్దతు ఇస్తున్నారు.