వాషింగ్టన్, డిసెంబర్ 2: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ను మరో అవార్డు వరించింది. అమెరికాలోని మెంఫిస్లో జాతీయ పౌరహక్కుల మ్యూజియం ఆయనకు ‘ది ఎమిసరీ ఆఫ్ పీస్ (శాంతి దూత)’ అవార్డును అందజేసింది. శ్రీశ్రీ రవిశంకర్కు అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉన్నదని మ్యూజియం బోర్డు డైరెక్టర్ శైలా కర్కేరా పేర్కొన్నారు. మానవతావాదిగా, శాంతి రాయబారిగా, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని, జాతుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు ఆయన ఎంతో కృషిచేశారని చెప్పారు.