ఇస్లామాబాద్, జూలై 4: తోషాఖాన అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఊరట లభించింది. దీనిపై సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఇమ్రాన్పై ఈ కేసు విచారణ యోగ్యం కాదని ఇస్లామాబాద్ హై కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పీటిఐ చైర్మన్ అయిన 70 ఏండ్ల ఇమ్రాన్ ఖాన్పై తొలుత ఈ కేసు విచారణకు అడిషనల్ సెషన్ జడ్జీ ఆమోదించారు.
దీనిపై ఇమ్రాన్ ఇస్లామాబాద్ హై కోర్టును ఆశ్రయించగా, కేసు క్రిమినల్ విచారణను జూన్ 8 వరకు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. తర్వాత విచారణ కొనసాగించిన జస్టిస్ అమీర్ ఫరూక్ జూన్ 23న తీర్పు రిజర్వ్ చేశారు. తోషాఖాన కేసులో ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేయడం, దేశంలో పెద్దయెత్తున విధ్వంసకాండ చోటుచేసుకోవడంతో పలు విమర్శలు వచ్చాయి.