ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కోవిడ్ సోకింది. కోవిడ్-19 పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలారు. సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబు ఈ విషయాన్ని ఓ ట్వీట్లో తెలిపారు. ఇటీవల అయిదు రోజుల పాటు బ్రిటన్లో పర్యటించి వచ్చిన పాక్ ప్రధాని కొంత అస్వస్థతకు లోనయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్యం సరిగా లేదన్నారు. డాక్టర్ సలహా ప్రకారం కోవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు చెప్పారు. ప్రధాని షెహబాజ్ ఆరోగ్యం కోసం ప్రజలు ప్రార్థించాలని మంత్రి కోరారు.