ఇస్లామాబాద్: పాకిస్థాన్ జర్నలిస్ట్, తాలిబన్ ప్రతినిధి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకున్నారు. ఈ వీడియోపై మీమ్స్ వైరల్ అయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్తో, పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ జమీల్ వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తాలిబన్ ప్రతినిధికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడంతోపాటు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీనికి ప్రతిగా తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ కూడా పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ జమీల్కు అభివాదం చేయడంతోపాటు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అలాగే తాను ఆఫ్ఘనిస్థాన్కు వస్తానని, తాలిబన్ ప్రభుత్వం విజయాలను కవర్ చేస్తానని పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ ఆయనతో అన్నారు.
కాగా, వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ లీక్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జర్నలిస్ట్ అర్షద్ యూసఫ్జాయ్ వీడియోను షేర్ చేయడంతోపాటు దీనిపై మండిపడ్డారు. ‘ఒక ఉగ్రవాది, సోకాల్డ్ పాకిస్థానీ జర్నలిస్ట్ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకున్నారు. ప్రత్యేక కవరేజ్ కోసం తనను ఆఫ్ఘనిస్థాన్కు ఆహ్వానించాలని తాలిబన్ నాయకుడిని ఆ జర్నలిస్ట్ అడిగాడు. కానీ ఆఫ్ఘనిస్థాన్లోని జర్నలిస్టులు అవమానాలు, హింసలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది ప్రాణాలు, ఉద్యోగాలు కోల్పోయారు’ అని అందులో పేర్కొన్నారు.