అవిశ్వాసం విషయంలో ప్రతిపక్షాలు సుప్రీం మెట్లెక్కడాన్ని పాక్ మంత్రి షేక్ రషీద్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ సంక్షోభానికి పరిష్కారం న్యాయస్థానాల వద్ద దొరకదని ఎద్దేవా చేశారు. రాజకీయ సంక్షోభాలకు పరిష్కారం కేవలం ప్రజల వద్ద మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఎన్నికలంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో తమకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. రాజకీయ సంక్షోభం ఏర్పడ్డప్పుడు అసలు ప్రతిపక్షాలు న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించాయని ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం, ఇమ్రాన్ పార్లమెంట్ రద్దు కోసం చేసిన సిఫారసుపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రతిపక్షం ప్రకటించింది.ఇక అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడు ఉంటుందో సుప్రీం కోర్టు నిర్ణయించాల్సి ఉందన్నారు. నిర్ణయం మార్చే వరకు జాతీయ అసెంబ్లీ ఎదుట తాము ధర్నా చేస్తామన్నారు. మాకు పూర్తి మెజారిటీ ఉందని, అవిశ్వాస తీర్మానంలో ప్రధానిని ఓడిస్తామని బిలావల్ భుట్టో
స్పష్టం చేశారు.