పాక్ ప్రధాని ఇమ్రాన్ను గద్దె దించడానికి బయటి నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో వివరించడానికే జాతీయ సెక్యూరిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని పాక్ ప్రధాని ఫావద్ చౌధురి ప్రకటించారు. ప్రధాని ఇమ్రాన్కు వ్యతిరేకంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లోనే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతోంది.. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే ఉద్యమమని అభివర్ణించారు. ఈ కుట్రలో ఎవరు కీలక భాగస్వాములో తమకు తెలుసని, భారత్, ఇజ్రాయిల్తో వారికి సంబంధాలున్నాయని ఫవద్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారశాఖ మంత్రి ఫవద్ చౌదరీ తెలిపారు. ప్రధాని నివాసంలోనే ఆ మీటింగ్ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా అంశాలను ఎన్ఎస్సీ కోఆర్డినేట్ చేస్తున్నది. ప్రధాని ఇమ్రాన్తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు ఈ మీటింగ్లో పాల్గొనున్నారు.