ఇస్లామాబాద్, జూన్ 11: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై తాజాగా మరో కేసు నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్లోని 625 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఇమ్రాన్పై ఆరోపణలు రావడంతో పాక్కు చెందిన అవినీతి నిరోధక విభాగం(ఏసీఈ) అతనిపై ఆదివారం కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ సోదరి ఉజ్మాఖాన్, ఆమె భర్తతో పాటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దర్పై కూడా కేసులు నమోదు చేశారు. పంజాబ్ ప్రావిన్స్లోని లయ్యా జిల్లాలో ఉన్న రూ.600 కోట్ల(పాక్ కరెన్సీ) విలువైన భూమిని రూ.13 కోట్లకే కొనుగోలు చేసినట్టు ఏసీఈ తెలిపింది. ఈ కేసుతో కలిపి ఆయనపై నమోదైన కేసుల సంఖ్య 140కి చేరుకున్నది.