కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం బుధవారం నాటికి 14వ రోజుకు చేరింది. పశ్చిమ దేశాల ఆంక్షలను లెక్కచేయని రష్యా, ఉక్రెయిన్పై దండయాత్రను కొనసాగిస్తున్నారు. పలు నగరాలు రష్యా వశమయ్యాయి. రాజధాని కీవ్ స్వాధీనానికి రష్యా సైన్యం తెగ ప్రయత్నిస్తున్నది. అయితే ఉక్రెయిన్ సైనికులు ధీటుగా ప్రతిఘటిస్తున్నారు. రష్యాపై తమదే పైచేయి అని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 12,000 మందికిపైగా రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ ఆర్మీ పేర్కొంది. రష్యాకు చెందిన 317 ట్యాంకులు, 49 విమానాలు, 28 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ వ్యవస్థలు, 81 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు కీవ్, జైటోమిర్, వాసిల్కివ్లలో వైమానిక దాడి సైరన్లు వినిపించినట్లు స్థానిక మీడియా సంస్థ కీవ్ ఇండిపెండెంట్ తెలిపింది. దీంతో నివాసితులు సమీపంలోని షెల్టర్కు వెళ్లాలని అధికారులు సూచించినట్లు వెల్లడించింది.
కాగా, రష్యా దాడుల్లో తూర్పు ఉక్రెయిన్లోని సెవెరోడోనెస్ట్క్లో 10 మంది పౌరులు మరణించినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అలాగే రష్యా జరిపిన వైమానిక దాడుల వల్ల సుమీలో 22 మంది చనిపోయినట్లు స్థానిక అధికారి తెలిపారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు.