మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పూర్తి భద్రత కల్పించాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాక్ హోంశాఖను ఆదేశించారు. ఆయన భద్రత విషయంలో తక్షణ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. తమ నేత ఇమ్రాన్కు ప్రాణ హాని వుందని, అందుకే వర్చువల్ మీటింగ్లు నిర్వహిస్తామన్న ఇమ్రాన్ పార్టీ నేతలు పేర్కొనడంతో పాక్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గురువారం లాహోర్ వేదికగా ఇమ్రాన్ ఓ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని హోంశాఖకు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. తాను ర్యాలీలోనే పాల్గొంటానని ఇమ్రాన్ తేల్చి చెప్పారు.
ప్రతి ఒక్కరూ శాంతిపూర్వకంగా సభలు నిర్వహించుకోవచ్చని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ప్రధాని షహబాజ్ స్పష్టం చేశారు. దీనికి ఎలాంటి ఆటంకాలు కూడా కలిగించవద్దని పోలీసులను ఆదేశించారు. అంతేకాకుండా ఇమ్రాన్కు బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డను ఇవ్వాలని, అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఉపయోగించాలని ప్రధాని షహబాజ్ మాజీ ప్రధాని ఇమ్రాన్ను కోరారు.