మాస్కో: నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మాస్క్వా (Moskva) నీట మునిగిపోయిన ఘటనలో ఓ సెయిలర్ మరణించగా, 27 మంది గల్లంతయ్యారని రష్యా ప్రకటించింది. ఈ నెల 13న ఉక్రెయిన్ సముద్రంలో జరిగిన భారీ పెలుడుతో మాస్క్వా నీటమునిగిపోయిన విషయం తెలిసిందే. గతవారం మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల అందులో ఉన్న భారీ ఆయుధాలు పేలిపోవడంతో అది పూర్తిగా దెబ్బతిన్నదని, అనంతరం సముద్రంలో మునిగిపోయిందని వెల్లడించింది. దీంతో ఓ సర్విస్మ్యాన్ మరణించాడని, 27 మంది సిబ్బంది ఆచూకీ లభించలేదని తెలిపింది. మరో 396 మందిని క్షేమంగా ఒడ్డుకు తరలించామని పేర్కొన్నది.
#war Photo of the damaged cruiser Moskva in the Black Sea in 15 April 2022.⚠️
First impressions of this shocking photo. Life-saving equipment (rescue rafts) on board are missing, which means they were dropped into the water during the rescue operation./1 pic.twitter.com/WREeqmSvtA— Capt(N) (@Capt_Navy) April 17, 2022
నాటి సోవియట్ రిపబ్లిక్లో భాగమైన ఉక్రెయిన్ మైకోలైవ్లోని షిప్యార్డ్లో మాస్క్వా యుద్ధనౌక తయారైంది. మొదట్లో దానిని స్లావాగా అని పిలిచేవారు. అది 1979 జూలైలో జలప్రవేశం చేసింది. అయితే సోవిట్ విచ్ఛిన్నమైన.. రష్యా ఆవిర్భవించిన తర్వాత రాజధాని మాస్కో పేరును సూచించేలా మాస్క్వాగా దీనికి నామకరణం చేశారు. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అది కీలకంగా వ్యవహరించింది. జార్జియా, సిరియా, ఉక్రెయిన్ సంఘర్షణలో సేవలందించింది.
16 దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యమున్న మాస్క్వా.. 611.5 అడుగుల (186 మీటర్లు) పొడవు ఉంటుంది. 62 మంది అధికారులతో పాటు 476 మంది సిబ్బందిని కలిగి సుమారు 40 ఏండ్ల పాటు సేవలందించిన రష్యా యుద్ధ నౌక మాస్క్వా ఈ నెల 15న ధ్వంసమై నల్ల సముద్రంలో మునిగిపోయింది.