పారిస్:యూరోప్లో మెరుపు వేగంతో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు. వచ్చే ఏడాది వరకు ఆ వేరియంట్.. ఫ్రాన్స్ను పూర్తిగా కమ్మేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్లో కఠిన చర్యలు తీసుకున్నది. బ్రిటన్ నుంచి వస్తున్న ప్రయాణికులపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. బ్రిటన్లో శుక్రవారం ఒకే రోజు సుమారు 15వేల కేసులు నమోదు అయ్యాయి. యూరోప్లో మళ్లీ కరోనా విజృంభిస్తున్నట్లు సంకేతాలు అందాయి. దీంతో అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జర్మనీలో అదనపు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఐర్లాండ్, నెదర్లాండ్స్లో కూడా కఠిన ఆంక్షలు విధించారు.