వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకరమే అయినా. .ఇప్పుడు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికాలో ఆ వేరియంట్కు చెందిన పాజిటివ్ కేసు ఒకటి బయటపడింది. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ అవసరం లేదని ఆయన అన్నారు. ఒకవేళ ప్రజలు వ్యాక్సిన్ తీసుకుని ఉంటే, మాస్కులు ధరిస్తే, లాక్డౌన్ అవసరం రాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం వైట్హౌజ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశమైన కెనడాలోనూ కేసులు నమోదు అయ్యాయి. 8 ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే అమెరికాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదే వైరస్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.