లాస్ఎంజెల్స్: భారత సంతతికి చెందిన ఎనిమిది నెలల చిన్నారిసహా నలుగురు కుటుంబసభ్యులు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కిడ్నాపయ్యారు. మెర్సిడ్కౌంటీలోని సెంట్రల్ వ్యాలీకి చెందిన కుటుంబం సోమవారం అపహరణకు గురైంది. ఆయుధాలు కలిగిన ఓ వ్యక్తి వీరిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
కిడ్నాప్ అయినవారిలో 8 నెలల అరూహిధేరి, బాలిక తల్లి జస్లీన్కౌర్ (27), తండ్రి జస్దీప్సింగ్ (36), మామ అమన్దీప్సింగ్ (39) ఉన్నారు. కిడ్నాప్ ఉద్దేశం కచ్చితంగా తెలియదని, కిడ్నాపర్ తాను దొరకకుండా సాక్ష్యాలు, ఆధారాలను నాశనం చేశాడని పోలీస్ అధికారులు తెలిపారు.