ఉక్రెయిన్పై రష్యా సేనల దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం ప్రారంభమైన సమయం నుంచి ఇప్పటి వరకూ ఉక్రెయిన్లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ విషయంలో ఓటింగ్ జరగ్గా… ఎక్కువ మంది సభ్యులు ఉన్నత స్థాయి విచారణ వైపే ఓటు వేశారు. అత్యధిక మెజారిటీ రావడంతో ఇది ఆమోదం కూడా పొందింది.
ఇందులో మొత్తం 47 మంది సభ్యులుండగా.. 32 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుగుణంగా ఓటు వేశారు. ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడి బాధ్యతా రాహిత్యంగా అభివర్ణించారు. అయితే ఈ ఓటింగ్కు భారత్ దూరంగా వుంది. భారత్తో పాటు పాక్, చైనా, అర్మేనియా, బొలీవియా, క్యామరూన్, క్యూబా, గాబన్, కజకిస్తాన్, నమీబియా, సూడాన్, ఉజ్బెకిస్తాన్, వెనీజులా కూడా ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి.