ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా మళ్లీ క్షిపణి ప్రయోగించింది. వారం రోజుల తేడాతో ఇది రెండవ పరీక్ష. ఇవాళ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు తెలుస్తోంది. గత వారం హైపర్సోనిక్ మిస్సైల్ను పరీక్షించిన నార్త్ కొరియా.. ఇవాళ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు దక్షణికొరియా సైన్యం వెల్లడించింది. జపాన్ కోస్టు గార్డులు ఈ కూడా పరీక్షను ద్రువీకరించారు. ఆయుధ పరీక్షలను ఆపేయాలని ఆరు దేశాలను ఉత్తరకొరియానే ఈమధ్యలోనే కోరాయి. అయినా ఉత్తరకొరియా మాత్రం క్షిపణి పరీక్షలను కొనసాగిస్తోంది. 2022 విధానాల్లో ఆయుధాల సమీకరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఇటీవల నార్త్కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన హైపర్సోనిక్ మిస్సైల్ పరీక్షను తప్పుపడుతూ.. ఫ్రాన్స్, ఐరిష్ రిపబ్లిక్, జపాన్, యూకే, అల్బేనియాతో పాటు యూఎన్ సంయుక్తంగా ఆ ప్రయోగాన్ని ఖండించాయి.