న్యూఢిల్లీ: ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని సోమవారం ఉత్తర కొరియా(North Korea) పరీక్షించింది. అయితే ఆ మిస్సైల్కు.. హైపర్సోనిక్ వార్హెడ్ ఉన్నట్లు ఆ దేశం వెల్లడించింది. ఆ ఆయుధంతో పసిఫిక్ తీరంలోని శత్రు దేశాలను చిత్తు చేయవచ్చు అని నార్త్ కొరియా పేర్కొన్నది. ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ అని పిలుస్తాం. అయితే అలాంటి మిస్సైల్స్ను ట్రాక్ చేసి, షూట్ చేయడం కష్టమైన పని. ధ్వని వేగం కన్నా అయిదు రెట్లు అధికం వేగంతో వెళ్లడం వల్ల వాటిని కూల్చడం వీలు కాదు.
అయితే సోమవారం ఉత్తర కొరియా పరీక్షించిన హైపర్సోనిక్ వార్హెడ్.. ధ్వని వేగం కన్నా సుమారు 12 రెట్ల వేగంతో వెళ్తుందని తేలింది. దాదాపు 1500 కిలోమీటర్ల దూరం ఆ క్షిపణి ప్రయాణించింది. గత ఏడాది ఏప్రిల్లో కూడా ఉత్తర కొరియా ఇలాగే హైపర్సోనిక్ మిస్సైల్స్ను పరీక్షించినట్లు తెలుస్తోంది. కొత్తగా పరీక్షించిన హైపర్సోనిక్ క్షిపణి లో.. కొత్త తరహా ఫ్లయిట్, గైడెన్స్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పింది.
కార్బన్ ఫైబర్తో చేసిన కొత్త ఇంజిన్ కొత్త మిస్సైల్లో ఉన్నది. సోమవారం జరిగిన పరీక్ష గురించి ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడారు. తాజా పరీక్షతో శత్రువులకు తామేంటో చూపించామన్నారు. మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు.