వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ (Jacinda Ardern) కరోనా బారినపడ్డారు. శుక్రవారం సాయంత్రం స్వల్ప లక్షణాలు బయట పడటంతో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జసిండా వచ్చే శనివారం వరకు ఐసోలేషన్లో ఉంటారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా, ఆమె గత శనివారం నుంచి స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. తన భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్కు కరోనా సోకింది. దీంతో అతనిపోటు జసిండా కూడా ఐసోలేషన్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనా వైరస్ తొలి కేసు నమోదైన తర్వాత అత్యంత కఠినంగా ఆంక్షలను అమలుచేసిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. దేశంలో ఇప్పటివరకు 892 మంది వైరస్ వల్ల మరణించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే అతిస్వల్పం. అయితే కరోనా వ్యాప్తి తగ్గడంతో దేశవ్యాప్తంగా మార్చి నెలలో ఆంక్షాలను ఎత్తివేశారు. దీంతో అప్పటినుంచి ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. గత వారం కరోనా నుంచి 50 వేల మంది బయటపడ్డారు.