సిడ్నీ, ఫిబ్రవరి 19: గాబ్రియెల్ తుఫాను ధాటికి న్యూజిలాండ్ అతలాకుతలం అవుతున్నది. తుఫాను విరుచుకుపడి వారం పూర్తైనా ఇంకా ఆ దేశం కోలుకోవడం లేదు. ఈ విపత్తులో 11 మంది మరణించినట్టు అధికారికంగా గుర్తించగా వందల మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. ఫిబ్రవరి 12న న్యూజిలాండ్ ఉత్తర భాగాన్ని తాకిన ఈ తుఫాను గత శతాబ్ద కాలంలో తమ దేశంలో సంభవించిన అతి పెద్ద ప్రకృతి విపత్తు అని అక్కడి ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ పేర్కొన్నారు. ఇప్పటికీ 6,431 మంది ఆచూకీ దొరకడం లేదని తెలిపారు. తుఫాను తీవ్రతకు దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించిందని, మంచి నీటి కొరత ఏర్పడిందని, పంటలు నాశనమయ్యాయని చెప్పారు.