మాస్కో: ఉక్రెయిన్పై చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ కొత్త దశకు చేరుకున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తెలిపారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంతో పాటు డాన్బాస్ ప్రాంతంలో రష్యా భీకర సైనిక చర్య మొదటు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాల లవ్రోవ్ మాట్లాడారు. డొనెస్కీ, లుగాన్స్క్ ప్రాంతాలను కైవసం చేసుకోవడమే రష్యా ప్రధాన టార్గెట్ అని లవ్రోవ్ తెలిపారు. ఆక్రమణ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని, సైనిక ఆపరేషన్లో కొత్త దశ ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. యావత్ ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన దశ అని ఆయన అన్నారు. సోమవారం రాత్రి సుమారు 1260 ఉక్రెయిన్ మిలిటరీ టార్గెట్లను రష్యా అటాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్టిల్లరీ దాడులతో పాటు రష్యా యుద్ధ విమానాలు సుమారు 60 ఉక్రెయిన్ సైనిక కేంద్రాలను టార్గెట్ చేశాయి. డాన్బాస్ ప్రాంతం కోసం రష్యా యుద్ధం ప్రారంభమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు.