లాస్ ఏంజిల్స్: దాదాపు దశాబ్ధ కాలం తర్వాత నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సుమారు రెండు లక్షల మంది నెట్ఫ్లిక్స్ చందాను వదులుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ఫ్లిక్స్ ఇటీవల చందా ధరలను పెంచింది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ ప్యాకేజీ ధరలను పెంచడం వల్ల ఆ కంపెనీ సబ్స్క్రైబర్స్ తగ్గారు. దీంతో పాటు ఉక్రెయిన్ వార్ వల్ల రష్యాలో నెట్ఫ్లిక్స్ తన సేవల్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గింది. ఇక ముందు కూడా భారీ స్థాయిలోనే సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా నెట్ఫ్లిక్స్ వార్నింగ్ ఇచ్చింది.
కొత్త సభ్యుల సైనప్ కోసం అకౌంట్ షేరింగ్పై కఠినంగా వ్యవహరించనున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. అకౌంట్ షేరింగ్ మితిమీరడం వల్ల సమస్యలు వస్తున్నట్లు కంపెనీ చెప్పింది. వాటాదారులకు పంపిన లేఖలో.. జూలై నాటికి మరో 20 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయే అవకాశం ఉన్నట్లు చెప్పింది. క్రమంగా ఆర్థిక వృద్ధి తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది.
గతంలో చివరిసారి 2011 అక్టోబర్లో అత్యధిక స్థాయిలో కంపెనీ తన సబ్స్క్రైబర్స్ను కోల్పోయింది. ఉక్రెయిన్ వార్ వల్ల రష్యా నుంచి తప్పుకోవడంతో ఆ దేశానికి చెందిన సుమారు ఏడు లక్షల సబ్స్క్రైబర్లను నెట్ఫ్లిక్స్ నష్టపోయింది. ధరలు పెంచడం వల్ల అమెరికా, కెనడాలో ఆరు లక్షల మంది తమ సర్వీసులను ఆపేసినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది.