ఖాట్మండు: పొరుగునున్న హిమాలయ దేశం నేపాల్లో విమాన ప్రయాణాల పునరుద్ధరణకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 24 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను, జూలై 1 నుంచి దేశీయ విమానాల రాకపోకలను పునఃప్రారంభించనున్నట్లు నేపాల్ సాంస్కృతిక, పర్యాటక, పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విమానాల్లో, విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది.