ఖాట్మండు: నేపాల్లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్లైన్స్కు చెందిన 72 సీటర్ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో 72 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం సమయంలో ఆ ఎయిర్క్రాఫ్ట్లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్క్రాఫ్ట్ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఇద్దరు పసికందులు సహా 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఇద్దరు ఐర్లాండ్కు చెందినవారు, ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పొఖారో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 30 మంది మృతదేహాలను వెలికితీశారు.
#WATCH | Visual from Nepal’s Pokhara International Airport where a passenger aircraft crashed earlier today. pic.twitter.com/C8XHL9f7Lu
— ANI (@ANI) January 15, 2023
#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023