న్యూయార్క్: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా తెలుగు మహిళ నీలి బెండపూడి నియమితులయ్యారు. ఈ వర్సిటీ ప్రెసిడెంట్గా తొలి మహిళే కాకుండా, తొలి శ్వేత జాతియేతర వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన ఆమె.. ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం కెంటకీలోని లూయిస్విల్లే యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్, ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. పెన్సిల్వేనియా వర్సిటీ 19వ ప్రెసిడెంట్గా ఆమెను ఏకగ్రీవంగా గురువారం ఎన్నుకున్నట్లు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగంలో 30 ఏండ్ల పాటు ఆమెకు అపార అనుభవం ఉంది.