మాస్కో: అజోవ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న రెండు వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఇప్పటి వరకు లొంగిపోయినట్లు రష్యా వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొగూ ఈ విషయాన్ని తెలిపారు. బహుశా 1700 మంది సైనికులు తమ ఆయుధాల్ని విడిచిపెట్టి ఉంటారని బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు. మరియపోల్ నగరంలో ఉన్న అజోవస్తల్ ప్లాంట్లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఉన్న వారిని రక్షించేందుకు ఉక్రెయిన్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. లొగిపోయినవారిని రష్యా ఆధీనంలోని ప్రాంతాలకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభావశీలి జెలెన్స్కీ..
టైమ్ మ్యాగ్జిన్ నిర్వహించిన రీడర్స్ పోల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అత్యంత ప్రభావిత వ్యక్తిగా నిలిచారు. మొత్తం 33 లక్షల మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. 2020 పబ్లిక్ ఫిగర్గా జెలెన్స్కీ ఉండాలని అయిదు శాతం ఓటర్లు కోరుకున్నారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పోల్లో టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ రెండవ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఉన్నారు.