యంగూన్: మయన్మార్ సైన్యం ఇవాళ ఆ దేశానికి చెందిన నలుగురు రాజకీయ కార్యకర్తల్ని ఉరి తీసింది. కొన్ని దశాబ్ధాల తర్వాత ఆ దేశం తొలిసారి మరణ దండన విధించింది. మాజీ ఎంపీ ఫోయో జియా థావ్, రచయిత కో జిమ్మీ, హలా మియా ఆంగ్, ఆంగ్ తురా జాలకు మరణశిక్ష అమలు చేసినట్లు మయన్మార్ జుంటా ఆర్మీ ప్రకటించింది. జూన్లోనే నలుగురికి మరణశిక్ష విధిస్తూ మయన్మార్ ఆర్మీ ప్రకటన చేసింది. దానిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అయితే గత ఏడాది మయన్మార్ సైన్యం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆంగ్ సాన్ సూకీకి చెందిన ఎన్ఎల్డీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగిన ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ సమయంలో ఆర్మీ రంగ ప్రవేశం చేసి ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నది. యంగూన్లోని ఇన్సెయిన్ చెరసాలలో ఆ నలుగుర్నీ ఉరి తీశారు. ఉరికి ఒక రోజు ముందు ఆ నలుగురు తమ తమ ఫ్యామిలీతో జూమ్ కాల్లో మాట్లాడారు. యంగూన్లో ఉన్న శ్మశానవాటికలోనే ఆ నలుగురికీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.