బీజింగ్: చైనాలో మైనార్టీలపై జరుగుతున్న దురాగతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వాట్సాప్, జీ మెయిల్ అకౌంట్లను వాడుతున్న ముస్లిం మహిళలను అదుపులోకి తీసుకుంటున్నట్టు వెల్లడైంది. గత కొన్ని నెలలుగా ఈ దురాఘాతం కొనసాగుతున్నట్టు తేలింది. వారిపై క్రిమినల్స్ అనే ముద్ర వేస్తున్నారు. ఈ వివరాలు ‘ఇన్ ది క్యాంపస్ చైనా హై-టెక్ పె నాల్ కాలనీ’ అనే పుస్తకంలో ఉన్నాయి. ఓ మహిళ వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకున్నందుకే చైనా అరెస్టు చేసిందని పుస్తకం వెల్లడించింది. మరో మహిళ తన ఐడీ నంబర్ను వినియోగదారులు ఉపయోగించుకోవడానికి అనుమతించిందన్న కారణంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.