కాలిఫోర్నియా, అక్టోబర్ 4: సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలుపై బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం. ఇంతకుముందు ప్రతిపాదించినట్టుగా షేర్కు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఆయన సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తల నేపథ్యంలో ట్విట్టర్ షేర్లు 12.7 శాతం, మస్క్కు చెందిన టెస్లా షేర్లు 1.5 శాతం ఎగిశాయి. కొనుగోలుపై ట్విట్టర్, మస్క్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు గత ఏప్రిల్లో మస్క్ అంగీకరించిన విషయం తెలిసిందే.