Musk Affair : టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్యతో ఆయనకు అఫైర్ ఉన్నట్లు, ఓ పార్టీలో ఆమెతో కలిసి కెటామైన్ డ్రగ్ తీసుకున్నట్లు ఓ మీడియా సంస్థలో కథనం రావడంతో ఇప్పుడు ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. సెర్గీ బ్రిన్ భార్య, న్యాయవాది నికోల్ షానన్కు ఎలాన్ మస్క్కు మధ్య ఉన్న అఫైర్ కారణంగానే.. సెర్గీ, నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.
సెర్గీబ్రిన్, ఎలాన్ మస్క్ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. టెస్లా కంపెనీ తయారు చేసిన తొలి మోడల్ కారును అందుకున్న వాళ్లలో సెర్గీ కూడా ఒకరు. కరోనా లాక్డౌన్ సందర్భంగా ఎలాన్ మస్క్కు ఆర్థిక సాయం అవరమైతే కూడా సెర్గీ బ్రిన్ ఆ డబ్బు ఇచ్చారు. ఇంతటి ప్రాణ స్నేహితుల మధ్య స్నేహబంధం తెగిపోవడానికి నికోల్ షానన్తో ఎలాన్ మస్క్కు ఉన్న శారీరక సంబంధమే కారణమని ఆ మీడియా కథనం స్పష్టం చేసింది.
2021లో సెర్గీ బ్రిన్ ఏర్పాటు చేసిన తన భార్య బర్త్డే పార్టీకి ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ఈ పార్టీలో సెర్గీ బ్రిన్ సతీమణి, బర్త్డే బేబీ నికోల్ షానన్తో మస్క్కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఆ తర్వాత కొన్ని రోజులకే మస్క్ సోదరుడు మియామి మస్క్ ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీకి నికోల్ షానన్ వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ కెటామైన్ డ్రగ్ తీసుకుని చాలాసేపు కనిపంచకుండా పోయారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యారు.
ఆ సమయంలో వాళ్లిద్దరూ శారీరంగా కలిశారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని నికోల్ షానన్ తన భర్త సెర్గీ బ్రిన్ ముందు అంగీకరించడంతో నిజమేనని తేలిపోయింది. తన బంధుమిత్రుల ముందు కూడా మస్క్తో తన అఫైర్ గురించి నికోల్ నిజం చెప్పింది. దాంతో సెర్గీ, నికోల్ దంపతుల మధ్య దూరం పెరిగింది. కొంతకాలం విడివిడిగా ఉండి ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
ఏడాదిన్నర క్రితం వారికి విడాకులు మంజూరయ్యింది. పరోక్షంగా ఎలాన్ మస్కే తన ప్రాణ స్నేహితుడు కాపురం కూలిపోవడానికి కారణమయ్యాడని ఆ మీడియా కథనం పేర్కొంది. నికోల్, మస్క్ అఫైర్ కారణంగా అటు సెర్గీ-నికోల్ దంపతుల కాపురమేగాక, ఇటు సెర్గీ-మస్క్ల స్నేహం కూడా చెడిపోయింది.