దోమల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 కోట్ల మంది వివిధ వ్యాధులబారిన పడుతున్నారు. ఇందులో పది లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. దోమల వల్ల రోగాలు ప్రబలడం, మందులు వాడటం.. ఈ జంజాటం కంటే, అసలు మనుషులను గుర్తించకుండా దోమలకు కంటిచూపునే తీసివేస్తే? ఈ వినూత్న ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు అమెరికా శాస్త్రవేత్తలు.
ఎలా కంటిచూపును పోగొడుతారు?
‘క్రిస్పర్-కాస్9’ అనే జన్యుక్రమ విశ్లేషణ సాంకేతికత సాయంతో మనుషులను గుర్తించకుండా దోమలకు కంటిచూపు కోల్పోయేలా చేస్తారు. ఇందుకోసం దోమల కంటిచూపునకు కారణమైన రోడోప్సిన్ వంటి ఐదు లైట్ సెన్సింగ్ ప్రొటీన్లను నిర్వీర్యం చేస్తారు. దోమల గుడ్లలో క్రిస్పర్ ద్రావణాన్ని ఇంజెక్ట్ చేశామని, గుడ్ల నుంచి వచ్చిన అనంతరం దోమలు మనుషులను గుర్తించలేదని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు. స్ప్రే మాదిరిగా కూడా ఈ ద్రావణాన్ని దోమలపై పిచికారీ చేయవచ్చన్నారు. ఈ ద్రావణం ప్రభావంతో తర్వాత పుట్టే దోమల్లో జన్యులోపాలు తలెత్తే అవకాశం ఉన్నదని తెలిపారు.
కంటిచూపు పోగొట్టే బదులు చంపొచ్చుగా?!
దోమల జనాభాను నియంత్రిస్తే జీవరాశి చక్రం దెబ్బతినే ప్రమాదమున్నది. ఆడ దోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని తాగుతాయి. మగ దోమలు మొక్కల కాండంలోని రసాన్ని పీల్చడంతో పాటు పరాగసంపర్కానికి సాయపడుతాయి. దోమలు, వాటి లార్వాలను గబ్బిలాలు, చిన్న పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, ఇతర కీటకాలు ఆహారంగా తీసుకుంటాయి.
కండ్ల సాయంతోనే దోమలు కుడుతాయా?
కండ్ల సాయంతోనే దోమలు మనుషులను గుర్తిస్తాయా? లేక వాటిలో వేరే గ్రాహణ వ్యవస్థలు ఉన్నాయా? అనే దానిపై ఇప్పటికే విస్తృత స్థాయిలో పరిశోధనలు జరిగాయి. అయితే, దూరంలోని వస్తువులను, మనుషులను గుర్తించడానికి దోమలు కండ్లనే ప్రధాన మాధ్యమంగా వినియోగిస్తున్నట్టు తేలింది. వాసన, ఉష్ణోగ్రత, తేమ తదితర మాధ్యమాల ద్వారా కూడా దోమలు మనుషులను గుర్తిస్తున్నాయని, అయితే ఇది తక్కువ శాతమేనని పరిశోధకులు చెబుతున్నారు.
లక్ష్యం ఆ దోమలే!
డెంగీ, చికున్గున్యా, జికా, మయరో, యెల్లో ఫీవర్ను కలుగజేసే ఆడిస్ ఏజిప్టి, మలేరియాకు కారణమయ్యే ఎనోఫిలిస్ దోమలే లక్ష్యంగా ‘క్రిస్పర్-కాస్9’ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ దోమల్లోని లైట్ సెన్సింగ్ ప్రొటీన్లను నిర్వీర్యం చేయడంలో ఈ సాంకేతికత సత్ఫలితాలను ఇచ్చినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.
దోమల వల్ల వచ్చే రోగాలకు భారతీయులు ఏటా పెడుతున్న ఖర్చు