మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై (Moscow) ఉక్రెయిన్ (Ukrain) డ్రోన్ల (Drones) దాడి కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం రెండు డ్రోన్లు మాస్కోలోని రెండు కమర్షియల్ భవనాలపై దాడిచేశాయి (Attack). అప్రమత్తమైన సైన్యం వాటిని కూల్చివేసింది. దాడి అనంతరం మాస్కో అంతర్జాతీయ విమానాన్ని మూసివేశారు. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. డ్రోన్ల దాడిలో రెండు భవనాలు ధ్వంసమయ్యాయని, ఎవ్వరూ గాయపడలేదని రక్షణ శాఖ (Defence ministry) ప్రకటించింది. ఒక డ్రోన్ను మాస్కో రీజియన్లోని ఒడింస్తొవో జిల్లాలో కూల్చివేశామని వెల్లడించింది. మరో రెండు ఆఫీస్ కాంప్లెక్స్లో దూసుకుపోయాయని చెప్పింది. దీనిని ఉగ్రవాద దాడిగా అభివర్ణించింది. ఇది ఉక్రెయిన్ పనేనని ఆరోపించింది.
రాత్రి సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు మాస్కోపై దాడికి పాల్పడ్డాయని నగర మేయర్ సెర్జీ సోబ్యానిన్ (Sergei Sobyanin) చెప్పారు. దీంతో రెండు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. కాగా, ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కో, దాని పరిసరాలపై చాలా అరుదుగా దాడులు జరుగుతూ ఉంటాయి. అయితే గతంలో కూడా ఉక్రెనియన్ డ్రోన్సు రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్పై సంచరించిన విషయం తెలిసిందే.