అంగారక గ్రహంపై మానవుడి కన్ను పడిన తొలి రోజు నుంచి.. ఆ అరుణ గ్రహంపై అడుగు పెట్టాలని కలలు కంటూనే ఉన్నాడు. దీనికోసం రకరకాల పరిశోధనలు చేసి, అంగారకుడి ఉపరితలాన్ని పరిశోధిస్తున్నాడు. వీటిలో భాగంగా ఎన్నో స్పేస్ మిషన్స్ను అరుణగ్రహంపైకి పంపారు.
అయితే వీటిలో కొన్ని అంగారకుడిపై ల్యాండయిన కాసేపటికే కాంటాక్ట్ కోల్పోగా.. మరికొన్ని ల్యాండవడానికి ముందే కాంటాక్ట్ కోల్పోయాయి. ఇలా అరుణగ్రహంపై మిస్ అయిపోయిన స్పేస్క్రాఫ్ట్లే కాక.. అక్కడకు పంపిన పలు రోవర్లలో కాలం చెల్లినవి కూడా ఆ గ్రహం ఉపరితలంపైనే ఉండిపోయాయి. ఈ లెక్కన అంగారకుడి ఉపరితలంపై 7,118 కేజీలపైగా మానవ వ్యర్ధాలు ఉన్నట్లు కాగ్రీ కిలిక్ తెలిపారు.
వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో రోబోటిక్స్ విభాగంలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేసే ప్రొఫెసర్ అయిన కాగ్రి.. మార్స్ రోవర్స్, ఆర్బిటర్స్ ద్రవ్యరాశిని లెక్కించి, దాని నుంచి ప్రస్తుతం ఇంకా పని చేస్తున్న వాటి ద్రవ్యరాశిని తొలగించి ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. అంగారకుడిపై ఇంకా తిరుగుతూ పనిచేస్తున్న పర్సవరెన్స్ మార్స్ రోవర్ కూడా ఇటీవల ఇలాంటి చెత్తనే గుర్తించింది. ఈ రోవర్లు కలెక్ట్ చేసే శాంపిల్స్లో ఈ వ్యర్థాలు చేరడం వల్ల ఫలితాలు మారిపోతాయని కొందరు పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
OH MY
Our extraterrestrial helicopter spotted the parachute and back-shell that guided the @NASAPersevere rover to the surface of Mars over a year ago.
And what a sight🤩
Space debris crash-landed on another world snapped by an aerial drone. What a timeline we live in. pic.twitter.com/XBQU1fo1wE— Erin Gibbons 🚀 (@ErinSpaceCase) April 27, 2022
My team has spotted something unexpected: It’s a piece of a thermal blanket that they think may have come from my descent stage, the rocket-powered jet pack that set me down on landing day back in 2021. pic.twitter.com/O4rIaEABLu
— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) June 15, 2022