మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధంలో ఇప్పటి వరకు 2,100కుపైగా సైనిక కేంద్రాలను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. 74 నియంత్రణ పాయింట్లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ కేంద్రాలు, 108 ఎస్-300, బక్ ఎం-1, విమాన నిరోధక క్షిపణి వ్యవస్థలను నాశనం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ తెలిపారు. 68 రాడార్ స్టేషన్లు, భూమిపై ఉన్న 69 విమానాలు, గాలిలో 21 విమానాలు, 748 ట్యాంకులు, ఇతర సాయుధ పోరాట వాహనాలు, 76 బహుళ రాకెట్ లాంచర్లు, 274 ఫీల్డ్ ఆర్టిలరీ, మోర్టార్స్, 532 ప్రత్యేక సైనిక వాహనాలు, 59 మానవ రహిత వైమానిక వాహనాల పరికరాలను ధ్వంసం చేసినట్లు వివరించారు.
కాగా, మార్చి 5న ఐదు రాడార్ స్టేషన్లు, రెండు బక్ ఎం-1 యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలను నాశనం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ తెలిపారు. అయితే రష్యా దాడిలో ఎంత మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు మరణించారు అన్నది ఆయన వెల్లడించలేదు.