టెహ్రాన్, ఏప్రిల్ 7: కొత్తగా నియమితులైన ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ స్పృహలో లేరని, ఖోమ్ నగరంలోని దవాఖానలో ఆయన చికిత్స పొందుతున్నారని టైమ్స్ పత్రిక తెలిపింది. తన గల్ఫ్ మిత్రులకు అమెరికా-ఇజ్రాయెలీ నిఘా వర్గాలు అందచేసిన దౌత్యపరమైన నివేదికలోని వివరాలను టైమ్స్ ఉటంకిస్తూ ఫిబ్రవరి 28న తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి దారితీసిన దాడిలోనే మొజ్తబా ఖమేనీకి కూడా తీవ్ర గాయాలయ్యాయని, ఫలితంగా ఆయన దేశాన్ని పాలించే పరిస్థితిలో లేరని పేర్కొన్నది.
విషమ పరిస్థితిలో ఉన్న మొజ్తబా ఖమేనీకి ఖోమ్లోని దవాఖానలో చికిత్స జరుగుతున్నదని, పాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని పత్రిక తెలిపింది.