America | హైదరాబాద్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమలాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని అమెరికా పోలీసులు తేల్చారు. టెక్సాస్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా గుర్తించారు. పొన్నాడ నాగేశ్వర్ రావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనుమడు, మనుమరాలు మృతి చెందారు. పొన్నాడ నాగేశ్వర్ రావు అల్లుడు లోకేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. నాగేశ్వర్ రావు పొన్నాడ సతీష్ చిన్నాన్న అని తెలిసింది.