నైపేయీ, మే 16: మోఖా తుఫాన్ ధాటికి మయన్మార్లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్ మృతుల సంఖ్య మంగళవారం నాటికి 60కి చేరుకున్నది.
ఒక్క రాఖినీ రాష్ట్రంలోనే 41 మంది చనిపోయారని అక్కడి మీడియా తెలిపింది. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారని వెల్లడించింది. తుఫాను ధాటికి వందల మంది గల్లంతయ్యారని పేర్కొన్నది.