లక్షలు సంపాదించడానికే ఇక్కడ ఏళ్లకు ఏళ్లు కష్టపడుతున్నాం. అటువంటిది.. జస్ట్ 32 నిమిషాల్లో కోట్లు సంపాదించాడా? అది ఎలా సాధ్యం అయింది. బ్యాంకుకు కన్నం వేశాడా అని అనకండి. ఎందుకంటే.. అతడు రూ. 5 కోట్లను నిజాయితీగా సంపాదించాడు. పదండి.. ఎలాగో తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ కామ్ రాకమ్ గురించే మనం మాట్లాడుకునేది. అతడు కాలిఫోర్నియాలో ఉంటాడు. 42 ఏళ్ల కామ్.. కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు. కానీ.. అదే కోవిడ్ వల్ల ఇప్పుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. తన ఆర్ట్లను డిజిటల్ ఆర్ట్స్గా మార్చేశాడు. ఆ డిజిటల్ ఆర్ట్స్ వేలంలో కేవలం 32 నిమిషాల్లో 5 కోట్లకు పైగా అమ్ముడుపోవడంతో నిమిషాల్లో కోటీశ్వరుడైపోయాడు.
2015లో తన ఆర్ట్స్ అమ్మితే రూ.8 లక్షలు కూడా రాలేదట. కానీ.. తన పెయింటింగ్స్ను డిజిటల్ ఆక్షన్ ద్వారా అమ్మితే మాత్రం కోట్లు వచ్చినట్టు కామ్ తెలిపాడు.
కోవిడ్ తర్వాత ఇన్స్టాలోని ఓ పేజీని చూసి.. డిజిటల్ ఆర్ట్స్ను అమ్మడం కామ్ ప్రారంభించాడు. ఎన్ఎఫ్టీ కలెక్షన్ కూడా ఏర్పాటు చేయాలని కొందరు అడిగారట. వాల్ స్ట్రీట్ థీమ్తో చాలా కార్టూన్ బుల్స్తో కూడిన పెయింటింగ్స్ను ఎన్ఎఫ్టీ కోసమే కామ్ వేశాడట. ఎన్ఎఫ్టీలలో కూడా వాటిని మంచి ధర పలికితే.. మిలియనీర్ నుంచి కామ్ త్వరలోనే బిలియనీర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.