పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని, ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్తో ఏటీ అయ్యారు. దాదాపు 7 గంటల పాటు వీరిద్దరూ లండన్ లో మాట్లాడుకున్నారు. పాక్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లొద్దని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఆర్థికంగా పీకల్లోతు కూరుకుపోయిన దేశ ప్రజలకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కూడా నిర్ణయించారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రోజూ ముందస్తు ఎన్నికల గురించే మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ ఎంత రెచ్చగొట్టినా, ముందస్తుకే వెళ్లొద్దని నవాజ్ షరీఫ్, ప్రధాని షెహబాజ్ గట్టిగా నిర్ణయించారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత పాక్ సమాచార మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడారు. పాక్లోని సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర నివేదికను పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు అందించామని పేర్కొన్నారు. అంతేకాకుండా షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న పనులను కూడా వివరించామని తెలిపారు.