న్యూయార్క్, ఏప్రిల్ 25: చందమామను అణుబాంబులతో పేల్చివేయాలని, అక్కడ ఉన్న అపార ఖనిజ సంపదను కొల్లగొట్టాలని అమెరికా ప్రయత్నించింది. ఇందుకోసం రహస్యంగా ఓ ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేసింది. చంద్రుడిని ఎలా పేల్చివేయాలన్నదానిపై పరిశోధనలకు వందల కోట్లు ఖర్చు చేసింది. ఆ రహస్య విభాగం పేరు ఏఏటీఐపీ. 2007లో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత అమెరికా తన ప్రయత్నాన్ని విరమించుకొన్నది. ఏఏటీఐపీని 2017లో రద్దు చేశారు. ఏఏటీఐపీ ప్రతిపా దనలు, పరిశోధనల నివేదిక ఇటీవల బయటకు వచ్చింది. ఇందులోని వివరాల ప్రకారం చంద్రుడి కేంద్ర మండలంలో ఉన్న అతి తేలిక లోహాల కోసం ఉపరితలం నుంచి 660 కిలోమీటర్ల లోతువరకు టన్నెళ్లు నిర్మించాలని ఏఏటీఐపీ ప్రతిపాదించింది. ఈ వార్తలపై అమెరికా ప్రభుత్వం స్పందించలేదు.