కాఠ్మాండు: నేపాల్కు చెందిన షెర్పా కామి రిటా(Kami Rita Sherpa) 28వ సారి మౌంట్ ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. దీంతో ఆయన వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇవాళ ఉదయం 9.23 నిమిషాలకు ఎవరెస్టు శిఖరంపైకి కామి రిటా చేరుకున్నట్లు సెవన్ సమ్మిట్ ట్రెక్స్కు చెందిన డైరెక్టర్ తాషి లక్పా షెర్పా తెలిపారు. ఈ సీజన్లో ఎవరెస్టును ఆయన రెండో సారి అధిరోహించారు. ఈ సీజన్లో తొలుత మే 17వ తేదీన అతను శిఖరాన్ని ఎక్కారు.
గతంలో పసాంగ్ దవా షెర్పా అనే వ్యక్తి మౌంట్ ఎవరెస్టును 27 సార్లు అధిరోహించాడు. అయితే పసాంగ్ రికార్డును ఇప్పుడు కామి రిటా బ్రేక్ చేశాడు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్ సంస్థలో సీనియర్ క్లైంబింగ్ గైడ్గా కామి రిటా పనిచేస్తున్నాడు. తొలిసారి అతను 1994 మే 13వ తేదీన ఎవరెస్టును అధిరోహించాడు. ఆ తర్వాత 1994 నుంచి 2023 వరకు 27 సార్లు పర్వతాన్ని ఎక్కారు.
కే2, లోట్సే పర్వతాలను కూడా ఆయన అధిరోహించారు. మనస్లూ పర్వతాన్ని మూడుసార్లు, చో యూ పర్వతాన్ని ఎనిమిది సార్లు ఎక్కారు. 8000 మీటర్ల ఎత్తు ఉన్న శిఖరాలను అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తిగా కామి రిటా షెర్పా రికార్డు క్రియేట్ చేశారు.