వాషింగ్టన్, జూన్ 25: మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2022గా బ్రిటన్లోని భారత సంతతికి చెందిన ఖుషీ పటేల్ నిలిచారు. విదేశాల్లోని భారత సంతతికి చెందిన యువతులకు ఈ పోటీలు నిర్వహిస్తారు.
అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్గా, శ్రుతికా మానే రెండో రన్నరప్గా నిలిచారు. కాగా, గయానాకు చెందిన రోషనీ రజాక్ మిస్ టీన్ ఇండియా వరల్డ్వైడ్ టైటిల్ గెలుచుకోగా, అమెరికాకు చెందిన నవ్య పైంగోల్ మొదటి రన్నరప్గా, సూరినామ్కు చెందిన చికితా మలాహా రెండో రన్నరప్గా నిలిచారు.