Shooting in Chicago | అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరో 37 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానలకు తరలించారు. అమెరికాలోని షికాగో సబర్బన్ ప్రాంతంలోని ఇండిపెండెన్స్ పరేడ్పై కాల్పులు జరిపినట్లు సమాచారం.
హైలాండ్ పార్క్లో పరేడ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే కాల్పులు జరిగాయి. దుండగుడు 57 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సదరు వ్యక్తి 18 ఏండ్ల శ్వేత జాతీయుడని అనుమానిస్తున్నారు. అతడి కోసం పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఆ దుండుగుడు పరేడ్ పక్కనే ఉన్న భవనంపై నుంచి కాల్పులు జరిపాడు. ఈ ప్రాంతంలో ఉన్న వారంతా షెల్టర్ తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకు రావద్దని హితవు చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన రోజు.. మృతులకు సంతాపం తెలపాల్సి వచ్చిందని మేయర్ నాన్సీ రోటరింగ్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో హైలాండ్ పార్క్ మేయర్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు చేశారు.