న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 3వ తేదీన అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు(Hottest Day) నమోదు అయినట్లు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రిడిక్షన్ పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా సగటున ఉష్ణోగ్రతలు 17.01 డిగ్రీల సెల్సియస్కు పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. 2016 ఆగస్టులో నమోదు అయిన 16.92 డిగ్రీల సగటును బ్రేక్ చేసింది. ఈ సారి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు అయ్యాయి.
దక్షిణ అమెరికాలో మరీ తీవ్ర స్థాయిలో హీట్వేవ్ కొనసాగుతోంది. చైనాలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. అక్కడ టెంపరేచర్లు 35 డిగ్రీలపైనే నమోదు అయ్యాయి. నార్త్ ఆఫ్రికాలో కూడా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటాయి. ప్రస్తుతం అంటార్కిటికాలో వింటర్ సీజన్. అయినా అక్కడ టెంపరేచర్లలు అధికంగా నమోదు అవుతున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరగడాన్ని మైలురాయిగా భావించలేమని, దాన్ని సెలబ్రేట్ చేసుకోలేమని లండన్ ఎన్విరాన్మెంట్ కాలేజీ శాస్త్రవేత్త ఫ్రైడరిక్ ఒట్టో తెలిపారు.