ఆంకారా: తుర్కియే భూకంపంలో మృతుల సంఖ్య 24 వేలు దాటిన విషయం తెలిసిందే. అయితే భారీ కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అనేక దేశాలకు చెందిన డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. ఇక ఇండియాకు చెందిన నలుగురు సభ్యులు డాగ్ స్క్వాడ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటోంది. ఎన్డీఆర్ఎఫ్ స్క్వాడ్లోని నాలుగు లాబ్రడార్ శునకాలు ఉన్నాయి. జూలీ, రోమియో, హానీ, రాంబో కుక్కులు తుర్కియే భూకంప బాధితుల్ని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఈ నాలుగు జాగిలాలతో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లాయి.
స్నిఫింగ్లో ఈ డాగ్ స్క్వాడ్ నిపుణులు. రెస్క్యూ ఆపరేషన్లో ప్రత్యేకంగా వాళ్లు శిక్షణ పొందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించే ప్రక్రియలు ఈ శునకాలు ముందుండనున్నాయి. ఖరమన్మారస్, అంటకాయా ప్రాంతాల్లో భూకంపం వల్ల భారీ ప్రాణ నష్టం జరిగింది. కాంక్రీట్ గోడలు కూలిపోవడంతో.. ఆ శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఫ్రీజింగ్ వాతావరణం ఉండడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఇలాంటి విపత్కర వాతావరణంలోనూ.. ఇండియన్ డాగ్ స్క్వాడ్ .. బాధితుల్ని గుర్తిస్తోంది.
ఆహారం,నీళ్లు, మందులు లేకపోవడంతో బాధితుల సమస్యలు మరింత పెరుగుతున్నాయి. సరైన రీతిలో షెల్టర్ హోమ్లు లేవు. ప్రజలు అక్కడ బ్రతకడం ఓ సవాల్గా మారింది. చాలా కఠినంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇండియన్ డాగ్ స్క్వాడ్.. చాలా సమర్థవంతంగా తన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది.