బెర్లిన్: జీ7 సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. నేతలంతా గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ప్రధాని మోదీ వద్దకు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ వచ్చి పలకరించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మోదీ మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి వచ్చిన బైడెన్.. బీజిగా ఉన్న మోదీ భుజాన్ని తట్టి మరీ పలకించారు. ఆ సమయంలో మోదీ వెనక్కి తిరిగి చూసి బైడెన్కు షేక్హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరూ పరస్పరం మాట్లాడుకున్నారు. ఇటీవల జరిగిన క్వాడ్ సమావేశాల సమయంలోనూ ఇద్దరు నేతలు ఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్న విషయం తెలిసిందే.
Biden walks upto PM Modi at G7 Summit, shows bonhomie between leaders of democratic world
Read @ANI Story | https://t.co/aKIgknrbsW#JoeBiden #PMModi #G7Summit #PMModiInGermany pic.twitter.com/E9DHcgyorT
— ANI Digital (@ani_digital) June 27, 2022