రోమ్: ఇటలీ ప్రధాని(Italy PM) జియార్జియా మెలోని.. తన భాయ్ఫ్రెండ్తో విడిపోయినట్లు ప్రకటించారు. జర్నలిస్టు అయిన భాయ్ఫ్రెండ్ ఆండ్రియా గ్యాంబ్రునో ఇటీవల ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆండ్రియాతో తన రిలేషన్ను బ్రేక్ చేస్తున్నట్లు ప్రధాని మెలోని వెల్లడించారు. దాదాపు పదేళ్ల నుంచి ఇద్దరూ కలిసి ఉన్నారు. ఓ మహిళను ఇంటర్వ్యూ చేస్తూ ఆండ్రియా కొన్ని అనుచిత ప్రశ్నలు వేశారు, దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భాయ్ఫ్రెండ్ ఆండ్రియాను వీడుతున్నట్లు ప్రధాని మెలోని తెలిపారు. కొన్నాళ్ల నుంచి తమ దారులు వేరయ్యాయని, ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని ఆమె అన్నారు. ఆండ్రియా చేస్తున్న వ్యాఖ్యల వల్ల మెలోని రాజకీయ జీవితంపై ప్రభావం పడుతోంది. 2015లో ఓ టీవీ ప్రోగ్రామ్లో మెలోని, గ్యాంబ్రునో తొలిసారి కలుసుకున్నారు. ఆ ప్రోగ్రామ్కు గ్యాంబ్రునో రైటర్గా ఉన్నారు. ఆ షోకు మెలోని గెస్ట్గా వచ్చారు. ఈ ఇద్దరికీ పుట్టిన అమ్మాయి ప్రస్తుతం ఏడేళ్లు ఉంది.