న్యూఢిల్లీ, జూన్ 12: భారత్లో కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే ఐదు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా ఉంటాయని ‘ది ఎకనమిస్ట్’ మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది ఎలాంటి శాస్త్రీయ అధ్యయన ఆధారాలు లేకుండా ఊహాజనితంగా వండివార్చిన కథనమని కొట్టివేసింది. మరణాలను అంచనా వేసేందుకు సదరు మ్యాగజైన్ అనుసరించిన అధ్యయనాలు.. ఏ దేశంలో లేదా ప్రాంతంలో మరణాల రేటు లెక్కింపునకు చెల్లుబాటు కానివని స్పష్టంచేసింది. ఆ అధ్యయనాలు ఎందుకు విశ్వసనీయం కావో కూడా వివరించింది. పబ్మెడ్, రీసెర్చ్ గేట్ వంటి సైంటిఫిక్ డేటాబేస్లలో ఈ అధ్యయనం కనిపించలేదని, సదరు మ్యాగజైన్ సైతం మెథడాలజీ వివరాలను వెల్లడించలేదని తెలిపింది. కొవిడ్ డాటా నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.