బ్రసెల్స్: నాటో చీఫ్ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్(NATO Chief Jens Stoltenberg) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ను పబ్లిక్గా తగలబెట్టడం నేరం కాదు అని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల స్వీడన్లో జరిగిన ఓ సంఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా చేయడం వల్ల భావోద్వేగాలను ఎంత దెబ్బతీసినట్లు అవుతుందో తనకు తెలుసు అని, ఖురాన్ను తగలబెట్టడం అభ్యంతరకరమే అయినా, అదేమీ నేరం కాదు అని ఆయన అన్నారు. నాటో మిలిటరీ కూటమిలో స్వీడన్ చేరికపై ఇంకా సందిగ్ధం నెలకొన్నది. ఆ దేశం ఆ గ్రూపులో చేర్చకుండా ఉండేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. స్వీడన్కు సభ్యత్వం ఇవ్వవద్దు అని టర్కీ ఆంక్షలు పెడుతోంది. స్టాక్హోమ్లో ఓ వ్యక్తి పబ్లిక్గా ఖురాన్ గ్రంధాన్ని తగలబెట్టడాన్ని టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్ ఖండించారు.